టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సీనియర్ హీరోలుగా చెలామణి అయ్యి బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన హీరోల వారసులు చాలామంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చిరంజీవి కొడుకు రామ్ చరణ్, నాగార్జున కొడుకు అఖిల్ మరియు నాగచైతన్య కొంతమంది హీరోల కొడుకులు నిర్మాతల కొడుకులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దగ్గుబాటి కుటుంబం నుంచి రానా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో అదే కుటుంబం నుండి హీరో వెంకటేష్ కొడుకు అర్జున్ సినిమా ఎంట్రీ కోసం వెంకీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల మహేష్ సుకుమార్ తో చేసిన ‘వన్ నేనొక్కడినే’ లో కొడుకు గౌతమ్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా, వెంకటేష్ తన కొడుకు అర్జున్ ని సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చేయించాలి అని అభిమానులు కోరుతున్నారు.

IHG

ప్రస్తుతం అర్జున్ ఇంకా చదువు పైనే ధ్యాస పెట్టడం జరిగిందని దగ్గుబాటి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇటీవల దగ్గుబాటి రామానాయుడు కార్యక్రమానికి సంబంధించి వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు ఈ విషయం పై  స్పందించారు. “అర్జున్ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు. అయినా వాడు ఇండస్ట్రీలోకి వస్తాడో రాడో కూడా తెలియదు. ఎందుకంటే మేం వాడ్ని ఫోర్స్ చేయం. వాడికి నచ్చింది వాడు సెలక్ట్ చేసుకుంటాడు.

IHG

మేం అర్జున్ కు కొన్ని పారామీటర్స్ సెట్ చేశాం. అందులో ఇండస్ట్రీ కూడా ఒకటి. ఫీల్డ్ లోకి వస్తే ఏంటి లాభం, నష్టమేంటి లాంటి విషయాల్ని అతడికి వివరించాం. ఫైనల్ నిర్ణయం వాడే తీసుకుంటాడు.” పై చదువుల కోసం అమెరికా వెళ్ళటానికి ప్రస్తుతం రెడీ అవుతున్నాడు సో సిల్వర్ స్క్రీన్ వెంకీ కొడుకు ఎంట్రీ అనేది ఇంకా అతని చేతిలోనే ఉంది అన్నట్టుగా సురేష్ బాబు వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: