మొట్టమొదటిసారి బాలయ్య బాబు వెబ్ మీడియా చానల్స్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో మొదటిలోనే కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇంటర్ నెట్ ప్రపంచం లో వైరల్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిన అంశంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వల్ల రేగిన మంటలు ఇంకా ఆరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో 2015 వ సంవత్సరంలో రీయూనియన్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

IHG

80’s లో ఇండస్ట్రీలో రాణించిన వారంతా కలిసి సమావేశమైన సమయములో హీరో హీరోయిన్ ల తో జరిగిన వేడుకలో గ్రూప్ ఫోటో దిగుతుండగా కొందరు కుర్చీలో మరికొందరు పైన ఇంకొంతమంది నేలపై కూర్చుని ఫోటో దిగే సమయములో… రజనీకాంత్ రావటంతో ఒక్కసారిగా నా పక్కన ఉన్న సుహాసిని రజిని వస్తున్నారు బాలయ్య కిందకు వచ్చాయని అన్నారు, దీంతో వెంటనే నాకు కోపం వచ్చి అందరూ ఒకటే కదా అని బదులిచ్చాను. అంతేకాకుండా రీయూనియన్ చెప్పి ఇలా బేధాలు చూపించడం ఏంటి నాకు టైం లో కోపం వచ్చింది.  ‘రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్?’’ అని అరిచా. ‘ఫొటో తియ్యండి’ అన్నా. అయ్యాకే కిందికి వచ్చా. నేను పర్ఫెక్షనిస్ట్‌ని. నా చుట్టూ అందరూ అలానే ఉండాలనుకుంటా. లేకపోతే కోపం వస్తుంది’’ అని నాటి అనుభవం గురించి తాజాగా ఇటీవల చెప్పుకొచ్చారు.

IHG

ఆ తర్వాత చిరంజీవి ఇంటిలో జరిగిన ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమానికి తనను పిలవకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరు ఇంట్లో ఈ వేడుక జరిగితే తనను పిలవకపోవడం ఏంటని ఆయనన్నారు. చాల బాధపడ్డారు. మొత్తం మీద ప్రస్తుతం చిరంజీవి పై బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలకు కారణం చిరంజీవి ఇంటిలో జరిగిన  వేడుకకు బాలయ్య బాబు ఆహ్వానం రాకపోవటమే అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది.  ఆ రోజు పక్కన పెట్టడంతో బాలయ్య బాబు మనసులో బాగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: