'బాహుబలి' సినిమా దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు  ఎస్.ఎస్.రాజమౌళి. అయన డైరెక్షన్ లో వస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా మొట్టమొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న తరుణంలో పైగా 'బాహుబలి' తర్వాత వస్తున్న నేపథ్యంలో మెగా మరియు నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలైన నాటి నుండి సినిమా పై క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది. చాలాసార్లు సినిమా షూటింగ్ ల విషయంలో హీరోలకు దెబ్బలు తగిలిన ఎక్కడ కూడా రాజమౌళి రాజీపడకుండా అవుట్ ఫుట్ బాగా రావాలని టైం తీసుకుంటూ సినిమా చేస్తూ వస్తున్నారు.

IHG

దీంతో ఈ ఏడాది జూన్ మాసంలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే  ఇప్పుడు కరోనా రూపంలో లాక్ డౌన్  ఏర్పడటంతో సినిమా షూటింగ్ ఆగిపోవటంతో, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం కచ్చితంగా చెప్పిన టైమ్ కి వచ్చే ఏడాది జనవరి మాసంలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ లకు సంబంధించి ప్రభుత్వాల నుండి అనుమతులు రావడంతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక విషయంలో రాజమౌళి కన్ఫ్యూజన్ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వార్తలు వస్తున్నాయి.

IHG

పూర్తి మేటర్ లోకి వెళ్తే సినిమా లో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ పాత్రలో చేస్తున్న బాలీవుడ్ నటి ఆలియా భట్ డేట్స్  విషయంలో జక్కన్న కన్ఫ్యూజన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న హీరోయిన్ ఒలివియాకు సంబంధించిన సీన్స్‌ను అవుట్ డోర్ లో రాజమౌళి ప్లాన్ చేశారట. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమానాలు తిరిగే అవకాశం లేకపోవడంతో పాటు ఇతర దేశాలలో ప్రస్తుతం సినిమా షూటింగ్ అంటే అనుమతులు రావటం కష్టమేనని ఈ పాయింట్ లో ఒలివియాకు సంబంధించిన సీన్స్‌ను ఎలా తీయాలో రాజమౌళి కన్ఫ్యూజన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: