అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి వకీల్ సాబ్  సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అసలైతే మే నెలలో రిలీజ్ కావాల్సింది కానీ పవన్ తో మరో 15 రోజుల షూటింగ్ పెండింగ్ ఉండటం.. ఆ లోపే కరోనా వల్ల షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. 

 

ఇక మిగిలిన ఆ పార్టీ షూటింగ్ చేసి దసరాకి ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కేసులు ఎక్కువవుతున్న ఈ టైం లో షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినా థియేటర్లు మాత్రం ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే దసరాకి అనుకున్న వకీల్ సాబ్ 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2021 సంక్రాంతికి అనగా జనవరి 8న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవడం కష్టమని టాక్. ఇక ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా సంకాంతికి రిలీజ్ అనుకున్నారు. 

 

అంటే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ పై  యుద్ధానికి దిగుతున్నారు. అది అసలు సాధ్యమయ్యే విషయం కాదు కానీ ఆచార్య, వకీల్ సాబ్ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం సంక్రాంతికి చెబుతుండటంతో అన్నయ్య, తమ్ముడు ఫైట్ ఈసారి పక్కా అనేలా వార్తలు రాస్తున్నారు. మరి వీటిలో ఏ సినిమా ముందుకు.. ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో తెలియాల్సి ఉంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: