ఇప్పుడు మన తెలుగులో ఉన్న పరిస్థితుల్లో చిన్న హీరోలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి గానూ చాల అమంది స్టార్ హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కారణం వారి సినిమాలు చాలా తక్కువ లో పూర్తి కావడమే కాకుండా ఆ సినిమాలను చేసే క్రమంలో ఖర్చు ఏ మాత్రం కూడా పెరిగే అవకాశం ఉండదు అని భావిస్తున్నారు. నటులు అందరూ కూడా చాలా తక్కువకి వస్తారు అని అంటున్నారు. దాదాపు ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా ఖర్చులు తగ్గించుకునే ఆలోచనలోనే ఉన్నారు అనే వార్తలు అయితే వాస్తున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక బడ్జెట్ అని పెట్టుకుని దానిలోనే సినిమాలను పూర్తి చెయ్యాలి అని భావిస్తున్నారు అని సమాచారం. చిన్న హీరోలతో సమానంగా బడ్జెట్ పెట్టుకుని అవసరం అయితే హీరోలకు రెమ్యునరేషన్ ని వసూళ్ళ ఆధారంగా  ఇవ్వాలి అని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు అల్లు అరవింద్ వంటి నిర్మాతలు ఇటీవల సురేష్ బాబు ని ఒక సందర్భంలో కలిసిన సమయంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్థావి౦చారు అని సమాచారం. దానికి  ఆయన కూడా ఓకే చెప్పారట. 

 

అగ్ర హీరోలతో సినిమాలు అంటే వందల కోట్లు పెట్టి వద్దు అని అసలు వసూళ్లు రావు అని భావిస్తున్నారట. గతంలో మాదిరిగా పరిస్థితి అసలు ఏ విధంగా అకుడా ఉండే అవకాశం లేదు అని సమాచారం. అందుకే ఇప్పుడు చాలా వరకు జాగ్రత్త పడుతూ సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నారు మన నిర్మాతలు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది స్టార్ హీరోలు ఎంత వరకు ఓకే చెప్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: