రీసెంట్ మలయాళం బ్లాక్ బాస్టర్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ కు డైరెక్టర్ దొరికాడు. ఏ స్టార్ డైరెక్టరో ఈ సినిమాను హాండ్యిల్ చేస్తాడనుకుంటే వరుస పరాజయాల్లో వున్న యంగ్  డైరెక్టర్ సుధీర్ వర్మ కు ఈ అవకాశం వచ్చింది. స్వామి రారా తరువాత సుదీర్ వర్మ కు సరైన సక్సెస్ దక్కలేదు. గత ఏడాది శర్వానంద్ తో చేసిన రణరంగం కూడా భారీ డిజాస్టర్ అయ్యింది అయినా కూడా సుధీర్ వర్మ కు మరోసారి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది సితార ఎంటెర్టైమెంట్స్. రణరంగం ను కూడా ఈ సంస్థే నిర్మించింది. ఇక అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను కూడా సితార ఎంటర్టైన్మెంట్సే నిర్మించనుంది. 
 
ఈ చిత్రానికి హీరోలు కూడా ఓకే అయ్యారు. మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటిరీమేక్ లో  నటించనున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో బిజూ మీనన్  పోషించిన పాత్రలో రవితేజ కనిపించనుండగా రానా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో నటించనున్నాడు. ఆగస్టు లో సెట్స్ మీదకు వెళ్లనుండగా ఈఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. 
 
సచి డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఫిబ్రవరి లో విడుదలై  60కోట్ల వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా తెలుగు తోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్  కానుంది. తమిళం లో సూర్య , కార్తీ ఈ రీమేక్ లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. హిందీ రీమేక్  హక్కులను ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం దక్కించుకున్నాడు. తన సొంత బ్యానర్ జేబీ ప్రొడక్షన్స్ లో ఈచిత్రాన్ని నిర్మించనుండగా బిజూ మీనన్ పాత్రలో జాన్ అబ్రహం నటించే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: