కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలకి పైగానే ఇండస్ట్రీ మొత్తం లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ రెండు నెలల్లో ఇండస్ట్రీకి వందల కోట్లల్లో నష్టం జరిగినట్టు ఇప్పటికే సీనియర్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇండస్ట్రీ సాధారణ పరిస్థితికి ఎప్పుడొస్తుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మేకర్స్ కి వీలైనంతగా బడ్జెట్ కంట్రోల్ లో ఉంచమని సూచిస్తున్నారు. 

 

IHG

 

ఇక త్వరలో షూటింగ్స్ మొదలు కాబోతున్న నేపథ్యంలో నిర్మాతలు హీరో హీరోయిన్స్ తో పాటు మిగతా నటీ నటులకి యూనిట్ కి రెమ్యూనరేషన్స్ తగ్గించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారట. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ కోపరేట్ చేయాలని అంటున్నారట. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గాని ముందు బడ్జెట్ కంట్రోల్ లో ఉండాలంటే మాత్రం వీళ్ళ రెమ్యూనరేషన్స్ తగ్గాల్సిందే. వీళ్ళే కాదు వీళ్ళ తో పాటు దర్శకులు సినిమాటోగ్రాఫర్ లాంటి ఎక్కువ రెమ్యూనరేష తీసుకునే టెక్నీషియన్స్ కి కూడా తప్పదు. 

 

IHG

 

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉంది పూజా హెగ్డే..రష్మిక మందన్న. ఇప్పుడు ఈ లిస్ట్ లో కీర్తి సురేష్ కూడా చేరింది. పూజా హెగ్డే రెమ్యూనరేషన్ 2 నుండి 2.5 కోట్ల వరకు ఉందని సమాచారం. అలాగే రష్మిక మందన్న రెమ్యూనరేషన్ దాదాపు 2 కోట్ల వరకు ఉందట. ఇక కాజల్ అగర్వాల్, తమన్నా, అనుష్క, నయన తార ల రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంది.

 

IHG

ఇప్పుడు వీళ్ళంతా తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే నిర్మాతలకి కాస్త ఊరట లభిస్తుంది. లేదంటే ముంబై నుండి కొత్త మోడల్స్ ని తెచ్చుకోవాల్సిందే. జల్లెడ పడితే ఖచ్చితంగా అద్భుతమైన మోడల్స్ దొరుకుతారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న వీళ్ళంతా అలా వచ్చినవాళ్ళే. కొంతమంది నిర్మాతలు ఇప్పుడు ఈ ఆలోచన కూడా చేస్తున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: