సాయితేజ్ డైలాగ్ చెలివరీ, యాక్టింగ్ స్టైల్లో అన్నింటిలో మామలిద్దరూ కనిపిస్తారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ తో అభిమానులను అలరిస్తుంటాడు. ఇక పెర్ఫామెన్స్ లోనే కాదు, కథల విషయంలోనూ మామయ్యలనే ఫాలో అవుతున్నాడు సాయితేజ్. ఇన్నాళ్లు మాస్ మూవీస్ తో మెప్పించిన తేజు, ఇప్పుడు పీరియాడికల్ డ్రామాలో నటించబోతున్నాడు. 

 

చిరంజీవి రీసెంట్ గానే హిస్టారికల్ మూవీ సైరా చేశాడు. ఇక పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామా చేయబోతున్నాడు. ఔరంగజేబు కాలం నాటి కథాంశంతో తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఇప్పుడు సాయి తేజ్ కూడా వీళ్ల రూట్ లోనే ఓ పీరియాడికల్ డ్రామాలో నటించబోతున్నాడనే టాక్ వస్తోంది.

 

సాయితేజ్ ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అంటూ బ్యాచిలర్స్ కు లెసెన్స్ చెబుతున్నాడు. నో పెళ్లి అంటూ లాక్ డౌన్ లో క్లాసులు కూడా తీసుకున్నాడు. అయితే ఈ బ్యాచిలర్ స్టోరీ తర్వాత ఓ పీరియాడికల్ డ్రామాలో నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ దేవరాయలు కథాంశంతో తేజు సినిమా చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు సినీజనాలు.

 

సాయితేజ్ తర్వాత వీరూ పోట్లతో సినిమా చేయబోతున్నాడట. బిందాస్ హిట్ తో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వీరూ ఈడు గోల్డ్ ఎహే తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఈ డిజాస్టర్ దెబ్బకు మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత వీరూ పోట్ల, శ్రీకృష్ణ దేవరాయలు కథాంశంతో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.  ఈ చిత్రంలో తేజు.. శ్రీకృష్ణ దేవరాయలు గెటప్ లో కనిపిస్తాడని టాక్. మొత్తానికి సాయి ధరమ్ తేజ్.. తన మామయ్యలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను అనుకరిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు మాస్ ఆడియన్స్ ను తెగ ఆగట్టుకున్న ఈ మెగా హీరో ఓ పీరియాడికల్ డ్రామాలో యాక్టింగ్ చేస్తూ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: