ఈసంక్రాంతికి దర్బార్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయాడు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్. మురగదాస్ డైరెక్ట్ చేసిన ఈచిత్రం తెలుగు తోపాటు తమిళంలోనూ భారీ నష్టాలను మిగిల్చింది. ఈసినిమా తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా రజినీ ,విశ్వాసం ఫేమ్ శివ డైరెక్షన్ లో సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి అన్నాథే అనే టైటిల్ ను ఖరారు చేశారు. సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తిచేసుకోగా ప్రస్తుతం కరోనా వల్ల వాయిదాపడింది.
 
అయితే ఈచిత్రాన్ని సంక్రాంతికి విడుదలచేయాలనుకున్నారు కానీ ఇప్పట్లో రజినీ షూటింగ్ లో జాయిన్ అయ్యేలా కనిపించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాకే షూటింగ్ ప్రారంభించాలని నిర్మాతలకు సూచించాడట దాంతో  ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రావడం అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇక ఈసినిమాకోసం రజినీ 30 శాతం రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోనున్నాడని టాక్. కరోనా నేపథ్యంలో నిర్మాతలపై భారం తగ్గించడానికి ఇటీవల కోలీవుడ్ హీరోలు విజయ్ ఆంటోని,హరీష్ కళ్యాణ్ తోపాటు స్టార్ డైరెక్టర్ హరి కూడా తమ తదుపరి చిత్రాలకు 25శాతం రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. తాజాగా రజినీ కూడా ఈ జాబితాలో చేరేలా వున్నాడు. 
 
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న అన్నాథేలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేష్ ,సీనియర్ హీరోయిన్లు మీనా , కుష్బూ తోపాటు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గత ఏడాది విశ్వాసంతో శివ భారీ  కొట్టడం అలాగే శివ, రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో అన్నాథే పై భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: