మహానటి సినిమా తర్వాత తన స్థాయిని పెంచుకుంది కీర్తి సురేష్. ఆమెకు అక్కడి నుంచి కూడా సినిమా ఆఫర్లు చాలా వరకు ఎక్కువగానే వస్తున్నాయి. టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే ఆమెతో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశం ఇవ్వడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె మాత్రం సోలో గా సినిమాలు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

ఇప్పుడు ఆమె రెండు మూడు భారీ ప్రాజెక్ట్ లను సోలో గానే ఓకే చేసింది. విజయ నిర్మల బయోపిక్ విషయంలో కీర్తి సురేష్ ఇప్పటికే నరేష్ తో మాట్లాడి ఓకే చేసింది అని వార్తలు ఎక్కువగానే టాలీవుడ్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె మరో విధంగా కూడా ఆలోచన చేస్తుంది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె సినిమాలను ఎక్కువగా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. దీనితో ఆమె ఇప్పుడు వెబ్ సీరీస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. 

 

ఆమె ఒక వెబ్ సీరీస్ ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. దీనికి సంబందించి ఆమెనే నిర్మాత అని కూడా వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో వస్తున్నాయి. మరి నిజమా కాదా అనేది తెలియదు. ఆమె ఇప్పుడు పెంగ్విన్ అనే సినిమాలో నటించింది. ఇది ఓటీటీ లో విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఆమె మరో సినిమాను అందులోనే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: