భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది శ్రీదేవి.  బాలనటిగా వెండి తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత హీరోయిన్ గా నటించింది.  అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళ్లింది.  కేవలం తెలుగు భాషల్లోనే కాదు  తమిళ,కన్నడ, మళియాళ భాషల్లో నటించిన ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్న క్రమంలోనే బాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడ కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళ్లింది.  బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది. శ్రీదేవికి ఇద్దరు అమ్మాయిలు జాన్వీ, ఖుషీ కపూర్.  అయితే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని ఎంతో తపన ఉండేది శ్రీదేవికి.. కానీ అనుకోకుండా ఆమె కన్నుమూశారు. 

IHG': <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JANHVI KAPOOR' target='_blank' title='janhvi kapoor-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>janhvi kapoor</a> after ...

శ్రీదేవి కన్నుమూసే నాటికి జాన్వి ‘ధడక్’ సినిమాలో నటించింది.  ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.  ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది జాన్వీ. ఈ మద్య బాలీవుడ్ నటి జాన్వికపూర్ కుటుంబం ఇటీవలే ముంబయిలో హోం క్వారంటైన్ పూర్తి చేసుకుంది. జాన్వి, ఆమె తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ రెండు వారాల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అందుకు కారణం.. వారింట్లో ముగ్గురు పనివాళ్లకు కరోనా సోకడమే.

IHG

తాజాగా తన క్వారంటైన్ అనుభవాలను జాన్వి తాజాగా మీడియాకు తెలిపింది.  పనివాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఎంతో భయాందోళనలకు గురయ్యామని, క్రమంగా పరిస్థితులకు అలవాటుపడ్డామని వివరించింది. క్వారంటైన్ లో ఉన్నన్నాళ్లు ఇంట్లో ప్రతి విషయం నా కంట్రోల్ లో ఉండేట్టు చూసుకున్నాను. మా నాన్న, చెల్లి ఆరోగ్యం నిత్యం పర్యవేక్షించేదాన్ని. వారు ఎప్పుడు, ఏంచేయాలో చెప్పేదాన్ని. దాంతో మా నాన్న నన్ను హెడ్ మాస్టర్ అంటూ పిలిచే వారని జాన్వి పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: