మహేశ్ బాబుతో సినిమా అంటే స్టార్ హీరోయిన్లు కూడా బల్క్ కాల్షీట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ప్రిన్స్ తో స్టెప్పులేసి స్టార్ రేసులో అడుగుపెట్టాలని కలలు కంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం కాల్షీట్స్ కావాలంటూ వెళ్లిన మహేశ్ బాబును వెయిటింగ్ లో పెట్టింది. ఆలోచించుకొని చెప్తానని ఆన్సర్ ఇచ్చిందట. 

 

టాలీవుడ్ టాప్ చైర్ కోసం పోటీలో ఉన్నాడు మహేశ్ బాబు. నంబర్ వన్ ర్యాంక్ ని కొట్టేయడానికి టఫ్ ఫైట్ చేస్తున్నాడు. ఇలాంటి హీరోతో రొమాన్స్ చేస్తే కెరీర్ కు బూస్టప్ వస్తుందని ఫీలవుతుంటారు హీరోయిన్లు. అందుకే ప్రిన్స్ తో స్టెప్పులేయడానికి హీరోయిన్లంతా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కియారా అద్వానీ మాత్రం మహేశ్ బాబుకి కాల్షీట్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తోందట. 

 

మహేశ్ బాబు లాక్ డౌన్ తర్వాత సర్కారు వారి పాట షూటింగ్ ను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. లాక్ డౌన్ లో ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి.. షూటింగ్ లకు పర్మీషన్స్ రాగానే రంగంలోకి దిగాలనుకుంటున్నాడు. అందుకే ఈ లాక్ డౌన్ లోనే కాస్టింగ్ ని ఫైనల్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ గా కియారా అద్వానీని కాంటాక్ట్ చేస్తే, కాల్షీట్స్ కావాలంటే కొంతకాలం వెయిట్ చేయాలని చెప్పిందట. 

 

కియారా అద్వానీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేశాక బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కభీర్ సింగ్ హిట్ లో ఫుల్ బిజీ అయ్యింది. ఇందూకి జవానీ, షేర్ షా, బూల్ భులాయా2 సినిమాలకు కాల్షీట్స్ ఇచ్చింది. కానీ లాక్ డౌన్ తో ఈ సినిమాలన్నీ ఆగిపోయాయి.  

 

షూటింగ్స్ కు పర్మీషన్ వచ్చాక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలా అని ఇప్పటి నుంచే ఆలోచిస్తోందట కియారా అద్వానీ. ఈ సిట్యుయేషన్ లో మహేశ్ టీమ్ కాంటాక్ట్ చేసింది. దీంతో చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్.. సర్కారు వారి పాట గురించి ఆలోచిస్తానని చెప్పిందట కియారా. 

మరింత సమాచారం తెలుసుకోండి: