టాలీవుడ్ లో చిరంజీవి సినిమాల్లో కామెడికి ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఎవరు అయినా సరే ఆయన కచ్చితంగా కామెడి చేస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్ అవసరం లేకుండా ఆయన నోటినుంచి వచ్చే మాటలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఏ దర్శకుడి సినిమా అయినా సరే ఆయన కామెడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అగ్ర దర్శకులు అయినా సరే ఆయన సినిమాల్లో కమెడియన్ ని లేకుండా కామెడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇక ఆయన హీరో గా వచ్చిన సినిమాల్లో కామెడి ప్రధానంగా ఉండే సినిమా జై చిరంజీవ. ఈ సినిమాలో అయన వేణు మాధవ్ తో కలిసి కామెడి ఎక్కువగా చేసారు అనే విషయం సినిమా చూసిన అందరికి అర్ధమవుతుంది. ఇక సునీల్ తో కలిసి చేసిన కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే ప్రేక్షకులకు ఒక రేంజ్ లో పిచ్చి ఎక్కించాయి అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా ఆ సినిమాలో కామెడి పరంగా చూస్తే నవ్విస్తుంది. ఏ సన్నివేశంలో అయినా సరే ఆయన కచ్చితంగా కామెడి చేసారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు జనాలను.
కథ సరిగా లేకపోవడం తో సినిమాను పెద్దగా ఆదరించలేదు. ఆ సినిమా తర్వాత చిరంజీవి ఇక ఒక సినిమా మాత్రమే చేసి దాదాపు పదేళ్ళ పాటు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఎదైద్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆయాన్ ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు అనే చెప్పాలి.