టాలీవుడ్ లో ఆంటీలకు ముందు నుంచి కూడా మంచి డిమాండ్ ఉంది. అగ్ర హీరోయిన్ గా సినిమాలు చేసిన వాళ్ళు తెలుగులో ఆంటీల పాత్రలకు డిమాండ్ ఉన్న నేపధ్యంలో ఎక్కువగా ఆ పాత్రలు చేయడానికి ఇష్ట‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు వెండి తెర‌ను ఏలిన హీరోయిన్లే ఈ పాత్ర‌ల్లో న‌టించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మాజీ హీరోయిన్ లకు ఆంటీలకు చాలా పెద్ద కష్టం వచ్చింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

గతంలో ఆంటీలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పవిత్ర లోకేష్ తో పాటుగా ప్రగతి వంటి వారు కాస్త డిమాండ్ చేసే పరిస్థితి ఉండేది. వాళ్ల‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా వాళ్లు అడిగినంత దర్శ‌క నిర్మాత‌లు ఇచ్చేవారు. ఇప్పుడు అలా డిమాండ్ చేస్తే వారిని పక్కన పెట్టడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రగతి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. 

 

చిన్న చిన్న పాత్రలకు కూడా ఇప్పుడు కొంద‌రు ఆంటీలు ఎక్కువుగా డిమాండ్ చేస్తున్నార‌ట‌. అందుకే వారి విషయంలో ఇప్పుడు దర్శక నిర్మాతలు కాస్త కఠినంగా వ్యవహరించాలని... కొత్త వారిని తీసుకోవాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రగతికి గతంలో 50 లక్షలు కూడా ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు అంత వద్దు అనే ఆలోచనలో ఉన్నారట. పవిత్ర లోకేష్ కి కూడా భారీగా తగ్గించే అవకాశం ఉంది. ఇక వీరి స్థానంలో సీరియ‌ల్స్‌లోనూ, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన మీడియం రేంజ్ హీరోయిన్లను తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: