ఇప్పుడు కరోనా లాక్ డౌన్ సమయంలో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో హీరోయిన్ లు ముందు వరుసలో ఉన్నారు. వాళ్లకు ఛాన్సులు లేక బయటకు వెళ్లలేక ఇంట్లో కాళ్లు, చేతులు కట్టేసినట్టు ఉండడంతో ఆగలేకపోతున్నారు. చాలా మంది హీరోయిన్ లు ఇప్పుడు సినిమాల ఎంపిక నుంచి ప్రతీ విషయంలో కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం చదువుతూనే ఉన్నాం. ఇక ఇప్పుడు హీరోయిన్ లకు చాలా షరతులు పెడుతున్నారు నిర్మాతలు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
అవును సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి కూడా ప్రచారం చెయ్యాలి అనే కండీషన్ ని పెట్టాలి అని భావిస్తున్నారు. అవును అందుకోసం సోషల్ మీడియాను అన్ని విధాలుగా వాడుకోవాలి అని చెప్తున్నట్టు తెలుస్తుంది. చిన్న హీరోయిన్ అయినా... పెద్ద హీరోయిన్ అయినా సరే సోషల్ మీడియాలో ఇప్పుడు సినిమాను ఖచ్చితంగా ప్రమోట్ చెయ్యాలి అని చెప్తున్నారట. సోషల్ మీడియాలో ప్రమోట్ చేయకపోతే పారితోషికం కూడా కట్ అని టాక్.
ఇందుకు కారణం ఏంటంటే కొందరు స్టార్ హీరోయిన్లు ప్రమోషన్లకు రాకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతుండడమే. అందుకే నిర్మాతలు అందరూ కలిసి ఇప్పుడు ఈ విషయంలో ఒక్కటయ్యారని అంటున్నారు. ఇప్పుడు పూజ హెగ్డే, నిధి అగర్వాల్ సహా కొందరు హీరోయిన్ లు సోషల్ మీడియాలో చాలా హాట్ గా కనపడుతున్నారు. వారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దానిని ఇప్పుడు సినిమాలకు వాడుకోవాలి అని దర్శక నిర్మాతలు ఎక్కువగా భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలా మంది హీరోయిన్ ల విషయంలో ఇలాగే ఆలోచన చేస్తున్నట్టు టాక్.