ప్రిన్స్‌ మహేశ్‌ బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలోని మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో విష‌యం చిత్ర యూనిట్ స‌భ్యులు వెల్ల‌డిస్తు వ‌స్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే మ‌హేష్‌బాబుకు జోడిగా హీరోయిన్ కియారాను క‌న్ఫ‌ర్మ్ చేశారు. దీంతో విల‌న్ వేట‌లో ప‌డిన చిత్ర యూనిట్‌కు సుదీప్ అయితే ఈ సినిమాకు స‌రిగ్గా స‌రిపోతాడ‌ని ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది.

 

 ఈమేర‌కు ఇప్ప‌టికే సుదీప్‌ను సంప్ర‌దించి క‌థ కూడా వినిపించిన‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిళ్‌లో సినీ జ‌నాలు చెవులు కొరుకుంటున్నారు. ప్రస్తుతం మూవీ టైటిల్‌, మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇక మహేశ్‌ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడినప్పటినుంచి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుండ స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టి. అయితే ఈ సినిమా టైటిల్‌తోనే స‌రికొత్త ఊపును తీసుకు వ‌చ్చిద‌ని చెప్పాలి. మాస్ ఇన్నోవేట్ అంటూ సినీ పండితులు పేర్కొంటున్నారు. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంద‌ని స‌మాచారం. అందుకే ఏరికోరి మ‌రి సుదీప్‌ను డైరెక్ట‌ర్ పరుశురామ్ ఎన్నుకున్న‌ట్లు తెలుస్తోంది. 

 

 ఇక ‘ఈగ’ సినిమాతో సుదీప్‌ తెలుగు అభిమానులకు సుపరిచితమే. ఇటీవలే దబాంగ్‌-3 చిత్రంలోనూ నెగటీవ్‌ రోల్‌ చేసి ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాడు. ద‌క్షిణాది చిత్రాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ సుదీప్‌కు మంచి మార్కెట్ ఏర్ప‌డుతోంది. అయితే స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టించేది..లేనిది సుదీప్ అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంది. అలాగే షూటింగ్‌కు అనుమతులు లభించిన వెంటనే చిత్రీకరణ స్టార్ట్‌ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్‌. సినిమా మొద‌టి షెడ్యూల్ ప్రారంభ‌మైతే గాని సినిమాకు సంబంధించిన మ‌రిన్ని క‌బుర్లు తెలియ‌రావ‌నే చెప్పాలి. చుద్దాం ఏం జ‌రుగుతుందో..?!

 

మరింత సమాచారం తెలుసుకోండి: