కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ ఫస్ట్ సినిమా తోనే కియార అద్వాని అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ తో  'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. మొదటి సినిమాతో భారీ విజయం సాధించిన రెండో సినిమాతోనే డిజాస్టర్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఒక్కసారిగా తన మకాం బాలీవుడ్ ఇండస్ట్రీ కి మార్చేసుకుంది. ఇంకా అప్పటి నుండి ఎప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడలేదు. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ‘సర్కారీ వారి పాట’. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ మరియు మైత్రి మూవీ మేకర్స్ అదే విధంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

IHG've done ...

ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరు అనే దాని విషయంలో ఇండస్ట్రీలో మరియు అభిమానుల లో సస్పెన్స్ నెలకొంది. మొదటిలో ఈ సినిమాలో మహేష్ సరసన కియార అద్వాని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా కి కియార డేట్స్ సర్ధుబాట్లు  కావడం లేదన్న మాట వినిపిస్తుంది. ప్రస్తుతం బీ టౌన్ లో వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా కియార ‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబంధించి తాజాగా అవకాశం ఉంటేనే త్వరలో ఏ విషయము చెబుతానని కియార అన్నట్లు టాక్.

IHG

కియార ఇచ్చిన రిప్లై విని టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఇప్పుడప్పుడే పట్టించుకోనే విధంగా లేదని సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఒక్కసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులు పడిందంటే ఈ అమ్మడు మళ్లీ సౌత్ వైపు చూడాలని… ఈ విధంగా తలబిరుసు తనంగా వ్యవహరించిన చాలామంది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తున్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: