సోషల్ మీడియాలో ఇప్పుడు సినిమాల గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే సోషల్ మీడియాలో దానిని ఎంతో పెద్దది గా చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలు ఇప్పుడు ప్రకటన మొదలు అది విడుదల అయి వసూళ్లు సాధించే వరకు కూడా అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట విషయంలో మూడు ప్రచారాలు కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అవి ఏంటీ అంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ని బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని చేస్తుంది అన్న టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. ఇంకొక వార్త ఏంటీ అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పాట పాడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మూడో వార్త ఏంటీ అంటే ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించే అవకాశం ఉంది అని సమాచారం. ఈ మూడు వార్తలు నిజం అయితే మహేష్ ఫ్యాన్స్కు అంతకు మించిన పండగ ఏం ఉంటుంది. ఇప్పుడు ఈ మూడు వార్తలు కూడా మహేష్ అభిమానులకు సోషల్ మీడియాలో పండగ వాతావారణం సృష్టించాయి.
ఇక పరశురాం దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఎంత సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి రేపు రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకోన్నిసంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.