ఇప్పుడు టాలీవుడ్ లో కీర్తి సురేష్ కి మంచి డిమాండ్ ఉంది. ఆమె చేసిన మహానటి సినిమాతో ఆమెకు నటన  పరంగా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల పక్కన ఆమెకుసినిమాలు చేసే అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం చాలా వరకు ఇప్పుడు జాగ్రత్తగానే సినిమాలు చేస్తుంది. అంతే గాని దూకుడుగా వెళ్లి సినిమాలను చెయ్యాలి అని ఆమె ఎక్కడా కూడా భావించడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆమె సినిమాల విషయంలో రేటు పెంచే ఆలోచనలో ఉంది అని టాక్ వినపడుతుంది. 

 

రేటు ని భారీగా పెంచే ఆలోచనలో ఆమె ఉంది అని అంటున్నారు. కనీసం రెండు కోట్ల వరకు సినిమాకు తీసుకునే ఆలోచనలో ఆమె ఉంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమె మాత్రం తక్కువకి ఏ సినిమా  కూడా చేయవద్దు అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూడు సినిమాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ లో వాయిదా అపడిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అవుతాయి. 

 

మహేష్ సినిమాలో ఆమెకు చేసే అవకాశం వచ్చిన సరే భారీగా ఆమె డిమాండ్ చేసింది అని సమాచారం. వేరే హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమె భారీగా డిమాండ్ చేస్తుంది. దీనితో ఇప్పుడు బాలీవుడ్ లో మినహా ఆమె తెలుగులో పనికి వచ్చే అవకాశం లేదని కొందరు ఆమెను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన పెంగ్విన్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది ఓటీటీలో. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: