టాలీవుడ్ లో పుష్ప సినిమా గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయిన నాటి నుంచి నేటి వరకు ఏ వార్త వచ్చినా సరే జనాలకు దాని మీద ఆసక్తికరంగానే ఉంది అని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త వస్తుంది. ఈ సినిమాలో విలన్ ని మార్చే అవకాశం ఉంది అని మళ్ళీ అంటున్నారు. బాబీ సింహాను ఈ సినిమా విలన్ గా తీసుకున్నారు. 

 

ముందు విజయ్ సేతుపతిని ఈ సినిమా విలన్ గా అనుకున్నా సరే ఆయనకు డేట్స్ ఇవ్వడం సాధ్యం కాకపోవడం తో ఇప్పుడు బాబీ సింహాను ఎంపిక చేసారు. ఇప్పుడు మళ్ళీ బాబీ సింహాను కాదు విజయ్ సేతుపతిని అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని విజయ్ ఇటీవల హైదరాబాద్ వచ్చాడు అని సమాచారం. తాను  మళ్ళీ చేస్తా అని తాను డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నా అని చెప్పాడు అని టాక్. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. 

 

ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. మరి హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత బన్నీసినిమా చేస్తాడు అనేది ఇంకా స్పష్టత రాలేదు. అతను బాలీవుడ్ లో చేసే అవకాశ౦ ఉంది అని టాక్. మరి చేస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమా లాక్ డౌన్ లో ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: