దిల్ రాజు కి నిర్మాతగా మంచి క్రేజ్ ఉంది మన తెలుగులో. స్టార్ హీరోతో సమానం గా ఉంది ఆయనకు క్రేజ్. ఆయన సినిమా చేసాడు అంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన ముందు నుంచి ఉన్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలతో అయినా చిన్న హీరోలతో అయినా సరే సినిమాలు చేయడానికి ఆయన ఏ మాత్రం కూడా భయపడే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. అగ్ర హీరోలు కూడా ఆయన దగ్గర మంచి కథ ఉంటే మాత్రం సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేసే అవకాశం ఉండదు అని అంటారు. 

 

ఇక ఇప్పుడు ఆయన తో సినిమా చేయడానికి రామ్ చరణ్ ముందుకు వచ్చాడు అని అంటున్నారు. రామ్ చరణ్ ఎప్పటి నుంచో దిల్ రాజు తో సినిమా చెయ్యాలి అని చూస్తున్నా సరే అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. ఇందులో స్పెషల్ ఏముందు అంటారా...? ఈ సినిమాలో రామ్ చరణ్ నటించడం లేదు.  కేవలం అతను నిర్మాత మాత్రమే.  వీరు ఇద్దరూ కలిసి శర్వా తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు కొత్త వ్యక్తి. 

 

అతనికి రామ్ చరణ్ కి మంచి పరిచయం ఉంది. దీనితో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాలి అని రామ్ చరణ్ భావించి దిల్ రాజు ని అడిగాడు అని టాక్. దానికి దిల్ రాజు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. జానూ సినిమాతో దిల్ రాజు బాగా నష్టపోయారు. అందుకే ఈ సినిమాతో ఆ నష్టాలను కవర్ చెయ్యాలి అని ఆయన భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: