ఛలో సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ అంటే రష్మీక మందన్నా.. ఎవరికైనా మొదటి సినిమా హిట్ అయితే రెండో సినిమా అవకాశం వస్తుందన్న సంగతి తెలిసిందే.. రష్మిక సినిమా అవకాశాలు కూడా అలానే వెతుక్కుంటూ వచ్చాయి.. మొదటి సినిమా హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా హవాను కొనసాగిస్తోంది.. 

 

 

ఆ అమ్మడు అందం ఆమెకు ప్లస్ అయితే ఆమె అభినయం ఆమెకు మంచి హిట్ నీ అందుకునేలా చేసింది..అందుకే ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తుంది..ఈ పాపకి బాగా లైఫ్ ఇచ్చిన సినిమా అంటే అది గీత గోవిందం అని తెలిసిందే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడీగా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి.. 

 

 


తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందు కన్నడ చిత్రాలలో రష్మిక నటించింది. కన్నడలో 'కిరాక్ పార్టీ' అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా చేసే సమయంలోనే ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. మ్యాటర్ నిశ్చితార్థం వరకు వెళ్లింది. కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో ఏం జరిగిందో కానీ... ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా... ఎవరి పనుల్లో వారు పడిపోయారు.

 

 

అయితే కిరాక్ పార్టీ సినిమాకు సీక్వెల్ సినిమాను తెరకెక్కంచనున్నారు..సీక్వెల్ తీసేందుకు రక్షిత్ శెట్టి రెడీ అయ్యాడు. వేరే హీరోయిన్ ను తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడు. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందనే భావనలో ఉన్నారట. ఈ విషయం రష్మికకు తెలియడంతో... రక్షిత్ తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. దీంతో, రష్మికతో కలిసి పని చేసేందుకు రక్షిత్ ను ఒప్పించే పనిలో నిర్మాతలు పడ్డారట.అయితే రక్షిత్, రష్మికతో నటించడానికి ఒప్పుకుంటాడా? లేదా కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: