ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ తన లేటెస్ట్ మూవీని యువ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అంతకుముందే అమితాబ్ తో ఓ బాలీవుడ్ సినిమా చేసిన పూరి మళ్లీ విజయ్ దేవరకొండ సినిమాతో తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. టాక్సీవాలా తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రెండు సినిమాలు అంచనాలను అందుకోలేదు.

 

ఇక ఇప్పుడు పూరితో చేస్తున్న సినిమా మీద కూడా అంచనాలు ఉన్నా ఈ సినిమా విషయంలో ఎక్కడో తేడా కొడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలా ఎందుకు అంటే.. పాన్ ఇండియా సినిమా అనగానే పూరి మేకింగ్ మీద దృష్టి పెట్టి కథ, కథనాలు ఎలా తీస్తాడో అన్న ఆలోచన.. అంతేకాదు కేవలం బాలీవుడ్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సినిమా తీస్తే తెలుగు ఆడియెన్స్ నిరాషచెందే అవకాశం ఉంది. అందుకే పూరి విజయ్ దేవరకొండ ఈ విషయాలను కచ్చితంగా పరిగణలో తీసుకోవాలని అంటున్నారు. 

 

ఇక ప్రచార చిత్రాల్లో ఈ సినిమా హడావిడి బాగుంది. సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు లైగర్, ఫైటర్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. టెంపర్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టిన పూరి విజయ్ దేవరకొండతో ఆశించిన స్థాయిలో సినిమా ఫలితాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇస్మార్ట్ శంకర్ తో పూరి ట్రాక్ ఎక్కేశాడు కాబట్టి విజయ్ సినిమా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తోనే చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం తప్పకుండా విజయ్ తో పాటుగా పూరికి మళ్లీ నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: