నవ మాసాలు మోసీ కనీ పెంచిన తల్లికి తన పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిందే.  తన పిల్లలు కొన్ని సార్లు తప్పు చేసిన పది మందితో వాదించి తన పిల్లలను వెనుకేసుకొస్తుంది. తన ను ఒక్క మాట అన్నా.. నా పిల్లలే కదా అని సర్ధుకు పోతుంది.  అలా గుండెల్లో పెట్టుకొని పెంచుకునే తల్లులు ఉన్నారు.. తప్పు చేస్తే తాట తీసే మాతృమూర్తులూ ఉన్నారు.  తాజాగా ఓ తల్లి తన సొంత కొడుకుపైనే పోలీసు కేసు పెట్టింది.. ఆమె ఒక సెలబ్రెటీ కావడం విశేషం. మలయాళీ నటి మాల పార్వతీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ట్రాన్స్‌జెండర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో కుమారుడు అనంత్‌ కృష్ణన్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

 

ఈ మద్య ట్రాన్స్‌జెండర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా సోషల్ మీడియాలో మాల పార్వతీ  ఆమె కుమారుడిపై ఆరోపణలు చేయడంతో.. ఈ విషయం మాల దృష్టికి వెళ్లింది.  గత కొంత కాలంగా మాల కుమారుడు అనంత్‌ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అభ్యంతరకర ఫొటోలు పంపిస్తున్నాడని సీమా వినీత్‌ ఇటీవల సోషల్‌మీడియాలో ఆరోపించారు. అయితే ఈ విషయంపై మాల వెంటనే సీమకు ఫోన్ చేసి పర్సనల్ గా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

 

అంతే కాదు తన కొడుకుపై పోలీసు ఫిర్యాదు కూడా చేశారు. అయితే తన కొడుకు మాత్రం సీమ కొంత కాలాంగా తన కొడుకుకు తెలుసని.. ఆమె అంగీకారం లేకుండా తాను  ఏమీ చేయలేదని చెప్పినట్లు తెలిపింది.   ఈ విషయంలో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుస్తుంది. నిజానిజాలు బయటకు వస్తాయి.  ఇప్పటికే కేసు పెట్టి.. అనంత్‌ సెల్‌ఫోన్‌ని పోలీసులకు అప్పగించాను. అయితే నేను మాత్రం సీమకే గట్టి సపోర్ట్ ఇస్తానని.. ట్రాన్స్ జెండర్లపై చూపించాల్సింది జాలి కాదని.. వారికి మేమున్నామన్న గట్టి నమ్మకాన్ని ఇవ్వాలని అన్నారు. ఒకవేళ నా కొడుకు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: