ప్రతి రోజు పండగే తో కెరీర్ లో మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్. మేలోనే విడుదలకావల్సిన ఈ చిత్రం కరోనా వల్ల  వాయిదాపడింది దాంతో సెప్టెంబర్ లో థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి నో పెళ్లి అనే సాంగ్ విడుదలకాగా  సూపర్ రెస్పాన్స్ తో యు ట్యూబ్ లో కోటి వ్యూస్ ను రాబట్టుకుంది. ఈసందర్భంగా సినిమా నుండి  కొత్త పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర బృందం. కాగా కోటి వ్యూస్ రావడంతో ఈ సాంగ్ కు పనిచేసిన టెక్నీషియన్స్ కు సాయి ధరమ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాబా నటేష్ కథానాయికగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. 
సినిమా తరువాత సాయి ధరమ్, ప్రస్థానం ఫేమ్  దేవాకట్టా తో సినిమా చేయనున్నాడు.ఇటీవలే ఈసినిమా లాంచ్ కూడా అయ్యింది. సోషల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రంలో నివేత పేతురాజ్ కథానాయికగా నటించనుంది. మణిశర్మ సంగీతం అందించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: