రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ. నందమూరి మెగా కుటుంబాల వారసులు. వెండితెర మీద ఇద్దరూ కనిపిస్తే చాలు కాసుల పంటే. అసలు ఆ ఊహే అదుర్స్. ఇక ఈ మూవీకి డైరెక్టర్ రాజమౌళి. ఆయన దర్శక బాహుబలి. బాహుబలి 2 తో రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన మొనగాడు.
ఇక ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ తో తన రికార్డుని తానే అధిగమించడం ఖాయమని అంతా గట్టిగా నమ్మారు. ఇక ఈ మూవీ కూడా స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి, కొమరం భీంల కధ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టెక్నీషియన్లు అంతా గండరగండలు.
విజయమే తప్ప మరో మాట లేని అద్భుతమైన ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే 2021 సంక్రాంతి ఆర్ ఆర్ ఆర్ తో దుమ్ము రేపేదే. కానీ అనుకోని ఉపద్రవంగా కరోనా మహమ్మారి వచ్చింది. దాంతో మూడు నెలలుగా షూటింగులు లేవు
మళ్ళీ ఎపుడు జరుగుతాయో తెలియదు. ఇక ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ ప్రాజెక్ట్, పాన్ ఇండియా మూవీకి విదేశీ నటులు కావాలి. కాన్వాస్ పెద్దది కావడంతో ఎక్కువమందే షూటింగులో పాల్గొంటారు. ఇక ఆర్.ఆర్.ఆర్ కి కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఎక్కువే వాటికి సమయం కూడా చాలా తీసుకుంటుంది.
ఇవన్నీ చూసుకుటే కచ్చింతంగా ఏడాది పైగా మూవీ రిలీజ్ కి పడుతుంది అంటున్నారు. మరి అంత టైం అంటే ఈ ఇంటెరెస్ట్ ని అలాగే ఉంచాలి. ఇప్పటికే రెండేళ్ళు అయింది మనసు పెట్టి, డేట్లు పెట్టి ఇద్దరు హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ సినిమా చేస్తున్నారు. మరో ఏడాది అంటే కూడా ఆలోచించాలి
ఇంత చేసినా సినిమా హాళ్ళు ఫుల్ క్రౌడ్ తో ఉంటేనే బొమ్మ అదిరేది.కలెక్షన్లు కుమ్మేసేవి. ఇపుడు కరోనా వైరస్ మూలంగా థియేటర్లు ఎపుడు తెరచుకుంటాయో, తెరచుకున్నా మునుపటిలా జనం వస్తారో లేదో అదో డౌట్. మొత్తానికి ఏ సినిమాకు లేని టెన్షన్ ఆర్.ఆర్.ఆర్ కి పట్టుకుందిట. నిజంగా ఇది సినీ ప్రేమికులకు కూడా బాధగానే ఉంది.
మళ్ళీ తెలుగోడి జెండా రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఎగరేస్తారని అంతా ఆనందిస్తున్న వేళ కరోనా వచ్చి మొత్తం టెన్షన్లో పెట్టేసింది. అదే ఇపుడు ఆర్.ఆర్.ఆర్ యూనిట్లో కూడా గుబులు రేపుతోందిట.