తెలుగు చిత్ర సినీ పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ. తన అంద చందాలతో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకుంది ఈ నటి. ఆమె మరేవో కదండీ మన రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలతో మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ అందరి సరసన రకుల్ రొమాన్స్ చేసింది. 

 

 

మంచి ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేసే రకుల్ ప్రీత్ సింగ్, మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించడం వల్లే ఆమె ఫిగర్ బాగుంటుందని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మామూలుగా బికినీ వేయాలంటే హీరోయిన్లకు కాస్త భయమనే చెప్పాలి. ఎక్కడ కాస్త కొవ్వు కనిపించినా, ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. అందుకే బికినీకి దూరంగా ఉంటారు. అయితే రకుల్ మాత్రం ఎప్పుడూ ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేస్తూ తన ఫిగర్ కాపాడుకుంటుంది.

 

 

అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తుంది. అది అలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన విజయం వెనుక అమ్మ పాత్ర ఎంతో ఉందని చెప్పుకొచ్చింది.

 

 

ఆనాడు మిస్ ఇండియా పోటీలకు వెళ్తున్నప్పుడు తనమీద తనకే నమ్మకం లేదని.. కానీ మా అమ్మ నామీద మాత్రం బోలెడు నమ్మకంతో ఉందన్నారు. మిస్ ఇండియా పోటీలు చాలా టఫ్ ‌గా ఉంటాయి. అందులో బికినీ రౌండ్ ఒకటి. ఆ రౌండ్‌లో అమ్మే ధైర్యం చెప్పింది. నువ్వు చేయగలవు అని.. ఇందులో ఏముందని చెబుతూ.. బికినీ ధరించడం, దానికి సంబందించిన షాపింగ్‌లో తోడుగా ఉంటూ నాలో కాన్ఫిడెన్స్ నింపిందని పేర్కోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: