బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం ఆయన మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకోగా తాజాగా సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. టెలివిజన్ సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన సుశాంత్ సింగ్ 1986 సంవత్సరం జనవరి 21న జన్మించారు. 
 
నటుడిగా, డ్యాన్సర్ గా, టెలివిజన్ పర్సనాలిటీగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మొదట్లో టెలివిజన్ సీరియల్స్ లో నటించిన సుశాంత్ సింగ్ "కై పో చే" సినిమాతో బాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు. శుద్ధ్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమేక్ష భక్సీ, ఎం.ఎస్ ధోనీ సినిమాలతో సుశాంత్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. అప్పటివరకు బాలీవుడ్ కే పరిచయమైన సుశాంత్ కు ఎం ఎస్ ధోనీ సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 
 
బీహార్ లోని పాట్నాలో జన్మించిన సుశాంత్ సింగ్ స్టేట్ లెవెల్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుశాంత్ బాలీవుడ్ హీరోయిన్ రేహా చక్రవర్తితో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సుశాంత్ కొన్నేళ్ల క్రితం బీ టౌన్ హీరోయిన్ కృతి సనన్ తో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచారు. కృతి సనన్ తో బ్రేకప్ అయిన తరువాత సుశాంత్ రేహా చక్రవర్తిని ప్రేమి 
 
ఈ సంవత్సరం సుశాంత్ దిల్ బేచరా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. సుశాంత్ సింగ్ మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో మరణ వార్త తెలిసి బాలీవుడ్ షాక్ కు గురైంది. సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సుశాంత్ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సినీప్రముఖుల మరణాలతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: