వరుస ప్లాపులతో డీలా పడిపోయిన పూరిజగన్నాథ్ గత ఏడాది 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ పూరి జగన్నాథ్ కారియర్ క్లోజ్ అయిపోయింది అని అందరూ అనుకుంటున్న తరుణంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ని డైరెక్ట్ చేసి నిర్మించి గత ఏడాది జూలై 18 వ తారీఖున సినిమాని రిలీజ్ చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన మార్కెట్ అలాగే ఉందని అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఊహించని విధంగా కలెక్షన్లు రావడంతో అటు ప్లాపుల్లో ఉన్న రామ్ కి ఇటువైపు పూరి జగన్నాథ్ కి 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో లైఫ్ వచ్చినట్లయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ని హీరోగా పెడుతూ 'ఫైటర్' అనే సినిమా చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా బొంబాయిలో ప్లాన్ చేయడం జరిగింది.

IHG

అదే రీతిలో బ్యాంకాక్ లో కూడా ప్లాన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో పరిస్థితి కరోనా వైరస్ కారణంగా పూర్తిగా మారిపోవడంతో… పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ విషయంలో షెడ్యూల్ చేంజ్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు సినిమా షూటింగ్ ల విషయంలో కొత్త నియమ నిబంధనలు సూచించడంతో విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమా ఎక్కువగా సెట్ లోనే కంప్లీట్ చేయాలని పూరి డిసైడ్ అయినట్లు టాక్.

IHG

గతంలో మాదిరిగా ఎక్కువ మంది ఆర్టిస్టులు మరియు పనిచేసే సిబ్బంది ఉండే అవకాశం లేకపోవడంతో పూరి జగన్నాథ్… ముందుగా ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి విజయ్ దేవరకొండ తో సాంగ్స్ కంప్లీట్ చేయాలని స్టెప్స్ వేయించడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరియు పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా అయిన వెంటనే పూరి జగన్నాథ్….బాలయ్య బాబు తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: