దేవి శ్రీ ప్రసాద్ కొద్దిగా వెనుకపడటంతో ఆ ఛాన్స్ అందుకున్న థమన్ వరుస సినిమాలు.. వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. థమన్ చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ పై మంచి ఫలితాలు అందుకోవడంతో స్టార్ సినిమా అంటే చాలు అతన్నే మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసుకుంటున్నారు. అసలే ఫాం లో ఉన్న థమన్ అల వైకుంఠపురములో సినిమా మ్యూజిక్ తో సెన్సేషనల్ గా మారాడు. ఆ సినిమాకు థమన్ ఇచ్చిన సంగీతమే సినిమా సక్సెస్ కు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అఫ్కోర్స్ త్రివిక్రం రైటింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా హైలెట్ గా నిలిచాయి. 

 

ఇదిలాఉంటే ఇప్పుడు థమన్ మరో క్రేజీ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. అదే సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట. పరశురాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గీతా గోవిందం తర్వాత రెండేళ్లు వెయిట్ చేసి మరి మహేష్ తో సినిమా చేస్తున్నాడు పరశురాం. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండాలని చూస్తున్నారు. అల వైకుంఠపురములో సాంగ్స్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయో వాటికి ఈక్వల్ గా ఉండేలా ఎస్.వి.పి సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారట. తన సినిమాల్లో మ్యూజిక్ మీద కూడా దృష్టి పెట్టే పరశురాం థమన్ తో కుమ్మేయాలని చెప్పాడట.

 

మహేష్, థమన్ లది సూపర్ హిట్ కాంబోనే.. దూకుడు దగ్గర నుండి మహేష్ సినిమా అంటే థమన్ కూడా దూకుడుగా పనిచేస్తాడు. తప్పకుండా సినిమా కథ, కథనాలకు తగినట్టుగా మహేష్ సర్కారు వారి పాటకి థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. థమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేశాడట. ఒకటి రెండు ట్యూన్స్ కూడా రెడీ అయినట్టు టాక్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: