బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సుశాంత్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యగా అనుమానం కూడా వ్యక్తం చేసారు.. ఇక, ఆర్థిక ఇబ్బందులు కూడా తెరపైకి వచ్చాయి.. ఈ క్రమంలోనే సుశాంత్ ఆస్తుల విలువ కూడా తెరపైకి వస్తున్నాయి.
కెరీర్ బిగినింగ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత టివి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరోగా మారిన తర్వాత వరుస విజయాలు అందుకున్నాడు. ఈయన ఒక సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు తీసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్లకు చేయడానికి రూ.కోటి వరకు తీసుకుంటారు. ఇలా బాగానే కూడబెట్టాడు.. సినిమాలు, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ సహా పలు చోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. సుశాంత్ సింగ్ గ్యారేజ్ లో చాలా కార్లు, బైకులు ఉన్నాయి.
ల్యాండ్ రోవర్, మాసెరటి క్వార్టర్పోర్ట్, బీఎండబ్ల్యూ లాంటి కార్లతో పాటు.. మంచి స్పోర్ట్స్ బైక్ లు అంటే ఎంతో ఇష్టపడేవాడు. ఇక ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.60 కోట్ల పైమాటగానే అంచనా వేస్తున్నారు. ఈ యువ హీరోకి అంతరిక్షం అంటే సుశాంత్ కి ఎంతో మక్కువ.. అందుకోసం ఏకంగా చంద్రుడిపైనే ప్లాట్ కొనుగోలు చేశాడు. సీ ఆఫ్ మాస్కోవీలో ఈయన ప్లాట్ ఉంది. 14ఎల్ఎక్స్00 అనే పవర్ఫుల్ టెలీస్కోప్తో ప్లాట్ను చూసి.. ఇంటర్నేషనల్ లూనర్ ల్యాండ్స్ రిజిస్ట్రీ ద్వారా ఈ ల్యాండ్ సొంతం చేసుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఆలా చేసిన తొలి బాలీవుడ్ హీరో సుశాంత్ కావడం విశేషం.