సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా సర్కారు వారి పాట.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, 14 రీల్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతుంది. గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న పరశురాం రెండేళ్లు వెయిట్ చేసి మరి మహేష్ బాబుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రికార్డులు మొదలు పెట్టారు. సినిమా కథ, కథనాలు ఇవేనంటూ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. స్టార్ సినిమా అంటే వీటితో సంబంధం లేకుండా రికార్డులు కొడతాయి. ఆ టైంలో అభిమానులకు నచ్చే సినిమా చేస్తే చాలు సూపర్ హిట్ కొట్టినట్టే.

 

ఇదిలాఉంటే సర్కారు వారి పాట సినిమా పక్కా హిట్ ఫార్ములాతో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. యువత నుండి గీతా గోవిందం వరకు తీసిన ప్రతి సినిమాతో తన సత్తా చాటిన పరశురాం సర్కారు వారి పాట సినిమాతో ఏకంగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా వచ్చే పరశురాం ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటాడని తెలుస్తుంది. సర్కారు వారి పాటతో కూడా అదే హిట్ ఫార్ములా అప్లై చేస్తున్నాడట పరశురాం. సర్కార్ వారి పాట సినిమాతో పరశురాం పెద్ద టార్గెట్టే పెట్టినట్టు తెలుస్తుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ వాయిదా పడ్డది కాని లేదంటే ఈ టైం కు ఈ మూవీ సెట్స్ మీద ఉండాల్సింది.

 

ఇక ఈ సినిమాలో మహేష్ ని సరికొత్తగా చూపించబోతున్నాడట పరశురాం. వెరైటీ టైటిల్ మాత్రమే కాదు.. వెరైటీ కథతో సర్కారు వారి పాట వస్తుందట. తప్పకుండా ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. మరి పరశురాం కు వచ్చిన ఈ సూపర్ స్టార్ ఛాన్స్ ఎలా ఉపయోగించుకుంటాడు అన్నది చూడాలి. అసలైతే 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగే లేటవుతుందని తెలియడంతో 2021 సమ్మర్ లో గాని సెకండ్ హాఫ్ లో గాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: