6ఏళ్ళ క్రితం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ - స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 24. టైం ట్రావెలర్ కథ తో తెరకెక్కిన ఈచిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. అయితే విక్రమ్ కుమార్ ఈ  సినిమాను సూర్యతో తీద్దామనుకోలేదట.
 
చియాన్ విక్రమ్ ను ద్రుష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాడట కానీ అనివార్యకారణాల వల్ల విక్రమ్ తోఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు  దాంతో సూర్య  లైన్లోకి వచ్చాడని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో విక్రమ్ కుమార్ వెల్లడించాడు  అలాగే ఈసినిమాకు ఇలియానాహీరోయిన్ గా హారిస్ జైరాజ్ ను సంగీత దర్శకుడుగా అనుకున్నాం కానీ వారిద్దరు కూడా డ్రాప్ కావాల్సివచ్చిందని విక్రమ్ కుమార్ తెలిపాడు. 
 
ఇక ఈసినిమాకు నేను తప్ప వేరే ఆప్షన్ లేదనేలా సూర్య నటనతో అదరగొట్టాడు. ఈచిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయగా సమంత , నిత్యా మీనన్  హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్ కుమార్. త్వరలోనే సూర్య ను కలిసి  నరేషన్ ఇవ్వనున్నాడు. అన్నికుదిరితే వచ్చే ఏడాది  24 సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
ఇదిలావుంటే గత ఏడాది గ్యాంగ్ లీడర్ తో ప్లాప్ ను చవిచూశాడు విక్రమ్ కుమార్. నాని హీరో గా నటించిన ఈ చిత్రం యావరేజ్ ఫలితాన్ని రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత విక్రమ్, నాగ చైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈసినిమాకు థాంక్యూ అనే టైటిల్ ను పెట్టనున్నారట. ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈచిత్రం ఈఏడాది చివర్లో  ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: