ప్రజెంట్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ డిఫరెంట్ లవ్ స్టోరీ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు సినిమాకి సంబంధించి షూటింగ్ 50 శాతం పూర్తవగా, మిగతా షూటింగ్ అవుట్ డోర్ చేయాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ దెబ్బకి ఆగిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా అవుట్ డోర్ బ్యాలెన్స్ షూటింగ్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లాక్ డౌన్ సమయములో ఈ ప్రాజెక్టు ఓకే చేసిన విషయం అందరికీ తెలిసిందే.

IHG'Mahanati' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> Nag Ashwin ...

వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ బాహుబలి స్థాయి మించిపోయి తీస్తున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు అని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

IHG

మూడో ప్రపంచ యుద్ధం ఆధారంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్సినిమా స్టోరీస్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు… తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. పాన్ ఇండియా తరహాలో సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ మరియు హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటులు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించా బోతున్నట్లు, వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి 2022 లో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: