కలక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా నటించిన సినిమా పెదరాయుడు. ఆయన ద్విపాత్రాభినయం చేయడమే కాదు సూపర్ స్టార్ రజినికాంత్ ను కూడా ఈ సినిమాలో పాపారాయుడు గెటప్ లో కనిపించేలా చేశాడు. మోహన్ బాబు, రజినికాంత్ నటించిన పెదరాయుడు అప్పట్లో ఓ పెద్ద సెన్సేషనల్ హిట్. 1995 జూన్ 15న రిలీజైన ఈ సినిమా ఈరోజుకి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మోహన్ బాబు ఆ సినిమా ఓపెనింగ్ రోజు వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమా ముహుర్త కార్యక్రమానికి అన్న ఎన్.టి.ఆర్ విశిష్ట అతిథిగా వచ్చారు.

 

క్లాప్ కొట్టడమే కాకుండా దేవుడి పటాల ముందు కొబ్బరికాయ కొట్టి చిత్రయూనిట్ కు తన శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో రజినికాంత్ పాపారాయుడు పాత్రలో తన నట విశ్వరూపం చూపించారు. రజినికాంత్ తెలుగు కెరియర్ కు పెదరాయుడు సినిమా కూడా ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు. పెదరాయుడు సినిమా తమిళ సినిమా నత్తమై నుండి రీమేక్ చేశారు. అక్కడ శరత్ కుమార్, మీనా, కుష్బు, విజయ్ కుమార్ నటించిన ఆ సినిమాను తెలుగులో రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. 

 

ఈ సినిమాను తమిళంలో కె.ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేయడం విశేషం. పాతికేళ్ల పెదరాయుడు వాట్ ఏ మెమొరీస్ అంటూ మోహన్ బాబు ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన పెదరాయుడు ఆయన కెరియర్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: