కొంతమంది దర్శకులు ఉంటారు.. కమర్షియల్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. కిక్ సినిమాతో కామెడీ + ఎమోషన్స్ ని, రేసుగుర్రం సినిమాతో ఫ్యామిలీ డ్రామాను, ధృవ సినిమాతో మంచి కాప్ ని పరిచయం చేసి అందరిని ఆకట్టుకున్న సురేందర్ రెడ్డికి అవకాశాలు రావడమే తక్కువ అయిపోయింది. 

 

ఏంటి? అని మీకు ఆశ్చర్యం వెయ్యొచ్చు.. నిజం. దర్శకుడి మేకింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా నరసింహ రెడ్డికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. అందుకే సైరా సినిమా రిలీజ్ కు ముందు ఓ రేంజ్ హడావిడి చేసారు. 

 

అయితే సినిమా రిలీజ్ అయినా తర్వాత మాత్రం అభిమానులలో ఆ ఆనందం కరువైంది. ఎందుకంటే చిరు అభిమానుల అంచనాలను సురేందర్ రెడ్డి అందుకోలేకపోయారు. దీనికి మెగాస్టార్ కూడా కాస్త నిరాశకు గురయ్యాడు. అయితే సైరా సినిమా స్టోరీ ఇప్పటికి ముగిసింది. ఇంకా సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా స్టార్ట్ చెయ్యాలి. 

 

కానీ ఆయన సినిమా కోసం ఏ ఒక్క స్టార్ హీరో దొరకడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద హీరోలు అందరూ చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ప్రస్తుతం అందరు ఒక్క సినిమాపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సురేందర్ రెడ్డి ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో ఒక కామెడీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. 

 

లాక్ డౌన్ లో కొన్ని కథలు సిద్ధం చేసుకోగా.. హీరో రామ్ కు రెండు కథలను వినిపించాడు. అయితే అందులో రామ్ ఒక్క సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే అవకాశం ఉంది. మరి అనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: