గుణశేఖర్ గత సంవత్సరం రానా దగ్గుబాటితో హిరణ్య కశిప సినిమాని ప్రకటించారు. భారీ కాన్వాయిస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో గుణశేఖర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. సురేష్ బాబు తో కలిసి గుణశేఖర్ హిరణ్య కశిప సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.  

 

కాని కొంతకాలంగా ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని మాట్లాడుకుంటున్నారు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ఠ్యా ఇక ఈ సినిమా ఉండదని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి నిర్మాత సురేష్ బాబు వెంటనే స్పందిస్తూ ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా మీద వస్తున్నవన్ని ఒట్టి పుకార్లేనని క్లారిటి ఇచ్చారు.

 

ఈ సినిమాతో పాటు రానా దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం "విరాటపర్వం". ‘నీదీ నాదీ ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 
డి. సురేష్‌బాబు స‌మ‌ర్పణలో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే రానా అరణ్య అన్న సినిమాని కంప్లీట్ చేసి ఉన్నాడు. 

 

ఇక రానా త్వరలో తేజ దర్శకత్వంలో ఒక సినిమాని అంగీకరించాడు. ఈ సినిమాకి రాక్షస రాజు రావణసురుడు అన్న టైటిల్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా అలాగే తేజ గోపీచంద్ తో తెరకెక్కించే సినిమాకి కలిపి ఆడిషన్స్ నిర్వహించారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వార అందిన సమాచారం ప్రకారం తేజ రానా కాంబినేషన్ లో తెరకెక్కబోయో కొత్త చిత్రం జూలై నాలుగో వారం నుండి సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు అధికారకంగా వెల్లడి కానున్నాయని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: