మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సినిమాల వేగాన్ని పెంచారు. ఖైది నంబర్ 150, సైరా సినిమాలతో అరవై ఏళ్లు దాటినా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటల శివ డైరక్షన్ లో ఆచర్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. మెగ ఫ్యాన్స్ ను మరింత హుశారెత్తించేలా చిరు, చరణ్ ఇద్దరు ఒకే సినిమాలో సర్ ప్రైజ్ చేస్తున్నారు.

 

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఆచర్య సినిమాలో చరణ్ సరసన రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి అదిరిపోయే ప్లాన్ చేశాడని తెలుస్తుంది. ఇప్పటికే మళయాల సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ కు రంగం సిద్ధం చేస్తుండగా మరో రెండు కథలకు ఓకే చెప్పినట్టు టాక్. లూసిఫర్ రీమేక్ ను సాహో డైరక్టర్ సుజిత్ కు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అతనితో పాటుగా కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరక్షన్ లో చిరు సినిమా ఉంటుందని టాక్. ఇదిలాఉంటే కథల విషయంలో ఇదివరకు కంటే వేగంగా డెశిషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

 

ఆచర్య రిలీజ్ తర్వాత మళ్లీ మరో రెండు క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రం తో మెగా మూవీ చాలా రోజులుగా డిస్కషన్ లో ఉంది. కాని ఆ కాంబో సెట్ చేయాలంటే కొద్దిగా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. చిరు పర్ఫెక్ట్ ప్లాన్ చూస్తుంటే కుర్ర హీరోలు కూడా షాక్ అవ్వాల్సిందే.       

 

మరింత సమాచారం తెలుసుకోండి: