టాలీవుడ్ ఇండస్ట్రీలో 'ఛలో' సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని అదిరిపోయే విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కొల్లగొట్టింది. ముఖ్యంగా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'గీత గోవిందం' సినిమాలో రష్మిక మందన పెర్ఫామెన్స్ కి తెలుగు కుర్రకారు ఎంతగానో ఫిదా అయిపోయారు. ఆ తరువాత అనేక క్రేజీ ప్రాజెక్టులలో నటించిన రష్మిక ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకని ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

IHG's Why <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RASHMIKA MANDANNA' target='_blank' title='rashmika mandanna-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rashmika mandanna</a> ...

ఇటువంటి సమయంలో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఒక పక్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక మందన మరోపక్క స్టోరీలు కూడా రాయడానికి తాజాగా శ్రీకారం చుట్టినట్లు సమాచారం. విషయంలోకి వెళితే లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇంటికే పరిమితం కావడంతో సెలబ్రిటీలు రకరకాల పనులు నేర్చుకున్నారు. మరియు పేదవారికి  సాయం కూడా చేయడం జరిగింది.

IHG

ఈ సందర్భంగా తాను ఈ లాక్ డౌన్ టైమ్ లో స్టోరీలు రాసినట్లు రష్మిక మందన సోషల్ మీడియాలో తెలిపారు. తాను రాసిన ఓ స్టోరీని కూడా వినిపించారు. “అగ్నివ్ మహల్ మెట్ల మీద నీలి రంగు చీర కట్టుకుని కూర్చుని ఉన్న మైరాపై శీతాకాలపు సూర్యుడి కాంతి ప్రసరిస్తోంది. ఆమె మహల్ రాతి మెట్లపై ఆసీనురాలైన వేళ…,” అంటూ ఓ అద్భుతమైన సినిమా స్టోరీని చెప్పేశారు. స్టోరీ విని అభిమానులు చాలా బాగుంది కానీ హీరోయిన్ అయితేనే బాగుంటావ్ అని… దయచేసి ఎక్స్పరిమెంట్లు చేయొద్దు అని అభిమానులు ఆమెకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: