మాస్ మహరాజ్ రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలు తీసి హిట్ అందుకున్న డైరక్టర్ గోపిచంద్ మలినేని 2017లో సాయి తేజ్ తో చేసిన విన్నర్ సినిమా తర్వాత రవితేజతో హ్యాట్రిక్ కాంబోగా చేస్తున్న సినిమా క్రాక్. మొన్నామధ్య సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. రవితేజతో సినిమా అంటే చాలా సరదాగా ఉంటుందని.. పని చాలా త్వరగా అవుతుందని అంటున్నాడు గోపిచంద్ మలినేని. ఈ సినిమాతో తమ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు.

 

క్రాక్ సినిమాకు సంబందించి మరో 10, 15 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందట. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ రెండు సాంగ్స్ మాత్రమే షూట్ చేయాల్సి ఉందని డైరక్టర్ అంటున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత్ తనకు ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణలకు సరిపోయే కథలు సిద్ధం చేశానని అంటున్నాడు గోపిచంద్. లాక్ డౌన్ టైం లో ఫ్యామిలీతో గడిపానని చెబుతున్న గోపిచంద్ క్రాక్ తర్వాత స్టార్ డైరక్టర్ కు అదిరిపోయే కథ సిద్ధం చేశానని.. త్వరలోనే ఆయనకు కలిసి కథ చెబుతానని అంటున్నాడు గోపిచంద్.

 

ఇంతకీ గోపిచంద్ టర్గెట్ ఏ స్టార్ హీరో అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. క్రాక్ సినిమాతో హిట్టు కొట్టి ఎలాగైనా తన సత్తా చాటాలని చూస్తున్నాడు గోపిచంద్.. ఈ సినిమా హిట్ రవితేజకు చాలా ప్రెస్టిజియస్ కానుంది. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ కూడా మళ్లీ హిట్టు కోసం తాపత్రయ పడుతున్నాడు. ఈ ఇయర్ మొదట్లో వచ్చిన డిస్కో రాజా కూడా అంచనాలను అందుకోలేదు. అందుకే క్రాక్ మీదనే రవితేజ అన్ని హోప్స్ పెట్టుకున్నారు.                 

 

మరింత సమాచారం తెలుసుకోండి: