బన్నీ సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న  హ్యాట్రిక్  మూవీ ‘పుష్ప’ షూటింగ్ కరోనా సమస్యలు లేకుండా ఉండిఉంటే కొంతవరకు పూర్తి అయి ఉండేది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈమూవీకి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించాలని సుకుమార్ అన్ని ప్లాన్స్ పూర్తిచేసిన తరువాత అతడి ఆలోచనలకు కరోనా అడ్డు తగిలింది.


ఈసినిమాకు సంబంధించి బన్నీని చాల డిఫరెంట్ గా చూపెట్టబోతున్నాడు అన్నవిషయం ఇప్పటికే విడుదలైన ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోష్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈసినిమాలో బన్నీ మాస్ లుక్ లో కనిపిస్తుండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో కూడ చాల ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నాడు.


ఈసినిమా షూటింగ్ మొదలయ్యే ముందు ఈమూవీలో బన్నీ వినియోగించబోయే కాస్ట్యూమ్స్ రెండురోజుల పాటు కాఫీలో నానబెట్టి తరువాత ఉతికి ఆరబెట్టడం ద్వారా బన్నీ కాస్ట్యూమ్స్ కు సంబంధించి ఓల్డ్ లుక్ కోసం ఇలా ట్రై చేయబోతున్నట్లు టాక్. ప్రస్తుతం తిరిగి షూటింగ్ లు ప్రారంభం అవుతున్నా ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా కేవలం 40 మందితో షూట్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడటంతో ఈసినిమాకు సంబంధించి ఫారెస్ట్ లొకేషన్ సీన్స్ ను పక్కకు పెట్టి ఈసినిమా పాటలు రికార్డ్ అయిన పరిస్థితులలో ముందుగా పాట‌ల‌ను రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించి ఆవిధంగా బన్నీకి ఈమూవీకి సంబంధించి మరొక ఆలోచన లేకుండా తెలివిగా సుకుమార్ బన్నీని ఇరుకున పెడుతున్నట్లు టాక్.


ఈమధ్య లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ కొందరు దర్శకులు చెపుతున్న కథలు వింటున్నాడు అని వార్తలు వచ్చిన పరిస్థితులలో ‘పుష్ప’ షూటింగ్ ఇంకా ఆలస్యం అయితే బన్నీ ఆలోచనలు వేరే మూవీ ప్రాజెక్ట్ వైపు వెళ్ళిపోతాయి అన్నభయంతో సుకుమార్ ఇలా ఈసినిమాకు సంబంధించి ముందుగా పాటల చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నట్లు టాక్. ‘రంగస్థలం’ లాంటి సూపర్ హిట్ వచ్చాక కూడ రకరకాల కారణాలతో సుకుమార్ తన విలువైన కాలాన్ని పోగొట్టుకున్న పరిస్థితులలో మరొకసారి నష్టపోలేక ఇలా సుకుమార్ తెలివిగా ప్రవర్తిస్తున్నాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: