బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.  ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   సుశాంత్ సింగ్ ఎందుకు  ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉన్నది.  సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  ‘పవిత్ర రిస్తా ‘ టీవీ సీరియల్ తో పాపులర్ అయిన 34 ఏళ్ళ సుశాంత్.. ‘కైపోచే’ మూవీతో తన సినీ ఆరంగ్రేట్రం చేశాడు. చివరిసారిగా ‘డ్రైవ్’ చిత్రంలో నటించాడు. సుశాంత్ నటించిన ‘ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొట్టింది. శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బైకేష్ బక్షి తదితర మూవీలు కూడా ఇతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 

 

రబ్జా, వెల్కమ్ టు న్యూయార్క్, నోంచిరియా సినిమాలు మంచి గుర్తింపు నిచ్చాయి. సెల‌బ్రిటీలు, అభిమానులు సుశాంత్ మ‌ర‌ణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. సుశాంత్ వ‌దిన సుధ‌..ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక సోమవారం క‌న్నుమూశారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషాదం మర్చిపోకముందే మరో విషాదం ఆయన ఇంట నెలకొంది. 

 

సుశాంత్ మ‌ర‌ణించాడ‌న్న వార్త తెలిసిన‌ప్ప‌టి నుండి సుధా క‌నీసం మంచి నీళ్ళు కూడా ముట్ట‌లేదట‌. దాంతో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షిణించింది. ఈ క్ర‌మంలో సుధా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృత్యువాత ప‌డింది. సుశాంత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న స‌మయంలోనే   సుశాంత్ వ‌రుస సోద‌రుని భార్య సుధా దెని బీహార్‌లోని పూర్ణియాలో క‌న్నుమూసార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: