తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని కథానాయకిగా దశాబ్దానికి పైగా ఏలేసిన భామ త్రిష. హీరోయిన్ గా దాదాపు 17ఏళ్ల లాంగ్ కెరీర్ ఈ చెన్నై చంద్రం సొంతం. రెండు భాషల్లోనూ దాదాపు ప్రతి స్టార్ హీరోతో కూడా సినిమాలు చేసింది. సినిమాలు, ఫ్యాషన్ షో, ఫోటోషూట్స్ తో బిజీగా ఉండే త్రిష సోషల్ మీడియాలో అంతకంటే బిజీగా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే త్రిష సడన్ గా తీసుకున్న ఓ డెసిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

IHG

 

‘నేను సోషల్ మీడియా నుంచి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు మనశ్శాంతి అవసరం. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోవడం మంచిదని భావిస్తున్నాను. ఇది సోషల్ మీడియా నుంచి నేను తీసుకుంటున్న చికిత్స వంటిది. నేను బాగానే ఉన్నాను. అందరూ బాగుండాలి. స్టే హోమ్.. స్టే సేఫ్. మళ్లీ కలుద్దాం’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో త్రిష అభిమానులకు షాక్ వంటిదే. సోషల్ మీడియాలో త్రిష యాక్టివ్ నెస్ అందరికీ తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అల్లరి, పెట్స్, సోషల్ మెసేజెస్.. ఇలా ప్రతి విషయంపై త్రిష యాక్టివ్ గా మెసేజెస్ చేస్తుంది.

IHG

 

 

అటువంటి త్రిష ఇలా అర్ధాంతరంగా సోషల్ మీడియా నుంచి ఎందుకు తప్పుకోవాలని అనుకుంటుందో ఎవరికీ అర్ధం కాలేదు. ఇటివల సోషల్ మీడియా హడావిడి ఎక్కువైపోయింది. ప్రతి చిన్న విషయం కూడా ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లో వస్తున్నయి. అందరూ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోతున్నారు. సోషల్ మీడియా లేకుండా జీవితం లేదనే స్థాయికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే త్రిష సోషల్ మీడియాకు దూరమైందా లేక మరేదైనా ఉందా అనేది త్రిష చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: