చిన్న చిత్రాలకు వరంగా మారిన ఓటీటీ.. భారీ సినిమాలకు మాత్రం తలనొప్పిగా మారుతోంది. ఫలానా సినిమా ఓటీటీలో వచ్చేస్తోందని ప్రచారం జరుగుతుండటంతో జనాలు ఏది నిజమో.. ఏది అబద్దమో తేల్చుకోలేకపోతున్నారు. దాంతో సదరు సినిమాల దర్శక, నిర్మాతలో లేక హీరోనో క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. కేజీఎఫ్ హీరో కూడా అలాంటి పనే చేశాడు. 

 

ప్రస్తుతం థియేటర్లు క్లోజ్ అవడంతో.. ఓటీటీ హవా నడుస్తోంది. ఇప్పటికే చిన్న సినిమాలు ఓటీటీ వైపు చూస్తుండగా.. పెద్ద చిత్రాలు కూడా అందుకు సిద్ధమయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో భారీ చిత్రాల దర్శక నిర్మాతలకు, హీరోలకు.. ఆ వార్తలన్నీ పుకార్లేనని నమ్మించడం కష్టంగా మారింది. ఒక్కొక్కరుగా వచ్చి తమ సినిమాల రిలీజ్ గురించి, క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

అనుష్క నిశ్శబ్ధం, రామ్.. రెడ్, రానా అరణ్య, నాని.. వి, ఈ చిత్రాలన్నీ ఓటీటీలో విడుదల కాబోతున్నాయనీ వినిపించింది. దాంతో సదరు చిత్ర యూనిట్ స్పందించక తప్పలేదు. తమ సినిమాలు థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్పినా.. నమ్మేలా లేరు సినీ జనం. ఎందుకంటే సోషల్ మీడియాలో అంతలా ప్రచారం జరుగుతోంది. దాంతో గందరగోళానికి గురవుతున్నారు దర్శకనిర్మాతలు. జనాల్లో కూడా ఈ వార్తలపై కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. 

 

ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కేజీఎఫ్ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతోందని జోరుగా ప్రచారం జరిగింది. నిర్మాతలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినా కూడా అలాంటి ప్రచారం జరుగలేదు. దాంతో హీరో యశ్ నే స్వయంగా రంగంలోకి దిగాడు. కేజీఎఫ్ 2ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు. అసలు ఆ ప్రశ్నకు ఆస్కారమే లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని.. క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా పెద్ద సినిమాలకు ఓటీటీ ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: