ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థలో సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్దదన్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా పెద్ద సినిమా..రీమేక్ సినిమా...కొత్త ప్రయోగాలు ...ఇలా ఏదైనా ఈ నిర్మాణ సంస్థ నుంచి ముందు వచ్చినదే. ఈ నిర్మాణ సంస్థ అంటే ప్రతీ ఒక్కరికి నమ్మకం. చెప్పాలంటే సురేష్ బాబు ని సినిమాల నిర్మాణం విషయంలో, బిజినెస్ పరంగా చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇక యంగ్ టాలెంట్ కి సురేష్ ప్రొడక్షన్స్ అమ్మ లాంటిది. కొత్త దర్శకులను, నటీ నటులను ఎంతో మందిని ఇప్పటి వరకు సురేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

 

అంతేకాదు ఎప్పుడు కమర్షియల్ పంథాలోనే కాకుండా మానవతా దృక్పథంలోను ఆయనకి ఆయనే సాటి అని చెప్పాలి. ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న అంచనాని వేయగల సమర్థులు. అంతేకాదు ఈ సినిమా వల్ల నష్టపోతారు అనుకుంటే ఆయనకి నష్టం వచ్చినా ఆలోచించకుండా ఆ సినిమాని పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సురేష్ బాబు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందు నుంచి కరోనా పరిస్థితులను అంచనా వేసుకుంటూ వస్తున్న ఆయన లెక్కలు ఏమాత్రం తప్పలేదు.

 

అందుకే ఇప్పుడు మరోసారి ఆయన నిర్మాణంలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకొని ఆగిపోయిన సినిమాలను అనుమతులు వచ్చి మొదలు పెడతారునుకుంటే అందరికీ షాకిచ్చారు. కరోనా పరిస్థితులు చక్కబడే వరకు ఆయన నిర్మాణంలో ఏ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే వెంకటేష్ తో నారప్ప నిర్మిస్తున్నారు. అలాగే కొడుకు తో విరాట పర్వం నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కొంత చిత్రీకరణ జరుపుకున్నాయి. అలాగే గుణశేఖర్ రానా కాంబినేషన్ లో హిరణ్య కశిప ..అలాగే మరికొన్ని సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేసిన సురేష్ బాబు ఆ సినిమాలన్నిటిని ప్రస్తుతానికి ఆపేశారు. పూర్తిగా పరిస్థితులన్ని సర్ధుకున్నాక గాని ఏ సినిమా షూటింగ్ మొదలు పెట్టమని నిర్ణయించుకున్నారట.     

మరింత సమాచారం తెలుసుకోండి: