అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభు తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమాలో అరంగేట్రం చేసి తమ రొమాన్స్ తో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ చిత్రంలోని ట్రైన్ సన్నివేశంలో వీళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే కెమిస్ట్రీ సినీ ప్రేక్షకుల చేత వాహ్వా అనిపించింది. కార్తీక్(నాగ చైతన్య) జెస్సి(సమంత) మృదువైన పాదాలను తాకే సన్నివేశం, ఆమె బుగ్గలను ముద్దుపెట్టుకునే సన్నివేశం, అధర చుంబనం చేసే సన్నివేశం తెలుగు ప్రేక్షకుల హృదయాలను నేరుగా తాకాయని, మనసులని పులకరింప చేశాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం మనసులను హత్తుకునేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 


సమంత డబ్బింగ్ వాయిస్ తో పాటు నాగచైతన్య ఒరిజినల్ హస్కీ వాయిస్ కూడా చాలా మధురంగా ఉండటం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలోని 7 పాటలలో 6 పాటలను అనంత శ్రీరామ్ రచించగా... ఆరోమాలో పాటను మాత్రం కైతప్రం రచించారు. ఈ అద్భుతమైన పాటలకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం తోడవ్వగా... అవన్నీ అద్భుతమైన ఎవర్ గ్రీన్ పాటలుగా నిలిచాయి. కాగా కుందనపు బొమ్మ పాటను అనంత శ్రీరామ్, కళ్యాణీ మీనన్ కలసి సంయుక్తంగా రచించారు.


నాగచైతన్య, సమంత ల కెమిస్ట్రీ కి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే అని చెప్పుకోవచ్చు. వింటున్నావా సాంగ్ లో నాగచైతన్య, సమంత చేసే రొమాన్స్ ప్రేక్షకులను టీవీలకు కట్టేసింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మనం, మజిలీ సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్స్ గా నిలిచాయి. 2014 సంవత్సరంలో విడుదలైన మనం సినిమాలో నాగచైతన్య సమంతల మధ్య చోటుచేసుకునే కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. 2019 వ సంవత్సరం లో విడుదలైన మజిలీ లో కూడా వీరిద్దరి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు కన్నుల విందుగా మారిందంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కి ఫిదా అయిన వారే తప్ప కానీ వారు ఎవరూ ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి: