స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి మొట్టమొదటి డీజే దువ్వాడ జగన్నాథం సినిమా లో నటించారు. 2017 జూన్ 23 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి హరీష్ శంకర్ తానే కథని అందించే దర్శకత్వం కూడా వహించాడు. ఈ చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన డీజే శరణం భజే భజే, గుడిలో బడిలో మదిలో, మెచ్చుకో మెచ్చుకో ఇంకా రెండు పాటలు ప్రేక్షకులను బాగా అలరించాలని చెప్పుకోవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వల్లనే ఈ సినిమా కొద్దిరోజులపాటు ఆడిందని సినీ విమర్శకులు చెబుతుంటారు. 


గుడిలో బడిలో మదిలో ఒడిలో పాటలో నాజూకైన తన అందంతో చాలా ముచ్చటగా అల్లు అర్జున్ సరసన డాన్స్ వేసి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది పూజా హెగ్డే. అప్పట్లో పూజా హెగ్డే, అల్లు అర్జున్ కాంబినేషన్ సూపర్ గా ఉందని అభిమానులు తెగ సంబరపడిపోయారు. సీటీమార్ పాటలో కూడా అల్లు అర్జున్ పూజ హెగ్డే మధ్య కొనసాగిన కెమిస్ట్రీ ప్రేక్షకులకు కన్నుల విందు చేసింది. ఇతర పాటల్లో కూడా తన జీరో సైజు నడుమును చూపిస్తూ సినీ ప్రేక్షకులకు మతిపోగొట్టేసింది పూజా హెగ్డే. స్విమ్మింగ్ పూల్ సన్నివేశంలో బికినీ వేసుకొని తన తడి అందాలను ఒలకబోస్తూ ప్రేక్షకుల ఒంటిలో సెగ పుట్టించింది. 


మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా రావాలని అభిమానులు అంతా కోరుకుంటున్న వేళ జనవరి 12, 2020, సంవత్సరంలో అల వైకుంఠపురములో సినిమా విడుదల అయ్యి అల్లు అర్జున్, పూజ హెగ్డే అభిమానుల కోరికను తీర్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో బుట్ట బొమ్మ పాటలో అల్లు అర్జున్ పూజా హెగ్డే అద్భుతంగా డాన్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని పొందారు అంటే అతిశయోక్తి కాదు. విదేశీయులు కూడా ఎస్.ఎస్.తమన్ సంగీతానికి ఫిదా అయిపోయారు. సామజవరగమనా పాటలో పూజా హెగ్డే కాళ్ల అందాలను అల్లు అర్జున్ తదేకంగా చూస్తూ సంతృప్తి పడటం అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. అల్లు అర్జున్ తో కలిసి రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డే తన అందాలను విపరీతంగా ఆరబోసిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: