తెలుగు చిత్ర పరిశ్రమలో చెదరని ముద్ర వేసుకోవడంతో పాటుగా సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. నూట యాభై కి పైగా సినిమాలలో నటించి ఎందరో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.. చిరంజీవి కష్టాన్ని నమ్ముకొని పైకోచ్చాడన్న విషయం తెలిసిందే.. ఎన్నో సినియాలలో నటించి వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు.. 

 

 

కష్టపడి సినిమా అవకాశాలను అందుకున్న హీరోల విషయానికి వస్తె చాలా మందే ఆ జాబితాలోకి చేరతారు. కానీ వారిలో చిరంజీవి స్థానం మాత్రం ఎప్పటికీ  మొదటిది.. అందుకే తెలుగు హీరోల నుంచి చిత్ర దర్శక నిర్మాతల వరకు అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు.. అయితే చిరంజీవి సరసన అప్పుడు నటించిన హీరోయిన్లు ఇప్పటికీ ఆయనతో జోడీ కట్టాలని ఆలోచనలో ఉన్నారట.. ఇంతకీ వారేవరంటే..రాధ , విజయ శాంతి, రాధిక , సుహాసిని వీరందరూ కూడా చిరంజీవితో కలిసి నటించాలని కోరిక ఉందంటూ గత ఏడాది జరిగిన రీయూనిన్ పార్టీలో వారు అన్నట్లు తెలుస్తోంది.. మరి ఈ వార్త నిజమైతే చిరంజీవి అభిమానుల సంతోషానికి అవధులు లేవని చెప్పాలి.

 


 

 

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. వాటిలో కొన్ని యాక్షన్ కోణంలో ఉంటే, మరి కొన్ని సినిమాలు కామెడీతో కడుపుబ్బా నవ్వించాయి.. అలాంటి సినిమాల విషయానికొస్తే విజయశాంతి , చిరంజీవి కాంబినేషన్లో చాలా సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..కొండవీటి దొంగ సినిమాలోని వీరి నటన అద్భుతం అనే చెప్పాలి.. వీరిద్దరి మధ్య మంచి సఖ్యత కూడా ఉంది.. ఒకటేమిటి వరుస సినిమాలలో నటించిన వీరిద్దరూ కొన్ని మనస్పర్థలు కారణంగా దూరంగా ఉన్నారు.  ఇటీవల సరిలెరు నికెవ్వరు ఫంక్షన్ కారణంగా మళ్లీ కలుసుకున్నారు..వీరిద్దరి కలయికలో ఇంకో సినిమా రావాలని మెగా అభిమానులు ఆశ పడుతున్నారు.. మరీ వారి కోరిక నెరవేరుతుందా లేదా చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: