టాలీవుడ్ లో మోహన్ లాల్ కి జనతా గ్యారేక్ సినిమాతో మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి ఇక్కడ. ఆయన తెలుగులో సినిమాలను విడుదల చేసినా సరే అది డబ్బింగ్ అయినా ఎలా ఉన్నా సరే జనాలు మాత్రం కచ్చితంగా సినిమాను చూస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు మోహన్ లాల్  ఇక్కడ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలుగులో. దేశ వ్యాప్తంగా మంచి పాపులర్  అయిన సీనియర్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చి చూస్తే... 

 

ఆయనను చిరంజీవి ఎక్కువగా అడుగుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఆయనకు అవకాశం ఇవ్వడానికి గానూ చిరంజీవి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తుంది. తన సినిమాలో ఆయన ఉండాలి అని ఆచార్య చిత్ర యూనిట్ కి ఇటీవల ఆయన చెప్పినట్టు సమాచారం. సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆడాలి అంటే ఆయన అవసరం ఉంది అని చెప్పారట చిరంజీవి. దీనికి స్పందించిన రామ్ చరణ్ ఇప్పుడు కష్టం డేట్స్ కుదరవు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఆయనకు ఇచ్చే పాత్ర లేదు అని ఇప్పుడు ఆయనను తీసుకుని రావడం కూడా కష్టం అని బడ్జెట్ పెరుగుతుంది అని అన్నారట. 

 

మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి ఆయనకు నేరుగా ఫోన్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు మోహన్ లాల్ అక్కడ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ రెండు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి లాక్ డౌన్ కారణంగా.

మరింత సమాచారం తెలుసుకోండి: