టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన మార్కెట్ అనగానే ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిన విషయమే. సినిమా మొదలైన నటి నుంచి విడుదల అయ్యే  వరకు కూడా అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు మార్కెట్ కోసం గానూ. ఇక మహేష్ ప్రభాస్ లాంటి హీరోలు అయితే పూర్తిగా పాన్ ఇండియా సినిమాల మీద ఫోకస్ చేసారు అనే చెప్పాలి. ఇప్పుడు రెండు మూడు వార్తలు టాలీవుడ్ లో వారికి సంబంధించి హాట్ టాపిక్ గా మారాయి అని చెప్పాలి. 

 

అది ఏంటీ అంటే టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో స్టార్ హీరోలకు బడ్జెట్ పెట్టే అవకాశం లేదు కాబట్టి నిర్మాతలు ఒక ప్లాన్ చేసారు. కమర్షియల్ హీరోలు గా ఉన్న వారికి ఒక ఆఫర్ ఇచ్చారు అని సమాచారం. అది ఏంటీ అంటే...  ఉదాహరణకు మహేష్ సినిమా విడుదల అవుతుంది అంటే అతనికి నైజాం ప్రాంతంలో పూర్తిగా హక్కులు ఇవ్వడం. ఇక దానిని అమ్ముకునే అధికారం అతనికే ఉంటుంది. దానిలో నిర్మాత పాత్ర ఉండదు. ఇలా ప్రాంతాల వారీగా సినిమాలను అమ్ముకోవాలి అని భావిస్తున్నారు. 

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది మాత్రమే సరైన మార్గం అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా ఇదే విధంగా నిర్మాతల నుంచి హామీ తీసుకుని సినిమాలను చేస్తున్నారు అని జనాలు అంటున్నారు. అగ్ర హీరోలు చాలా వరకు కూడా ఇప్పుడు లా డౌన్ కారణం గా నష్టపోయే పరిస్థితి అయితే వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి. ప్రభాస్ సినిమాల విషయంలో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని టాక్ చూడాలి ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: